Saturday, October 30, 2010

చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా ..గతమెంతో ఘనకీర్తి కలవోడా !

తెలుగు లలితకళాతోరణానికి రాజీవ్ పేరును జోడిస్తూ రాష్త్ర ప్రభుత్వం జారీచెసిన ఉత్తర్వులపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రతిపాదనను తెచ్చిన టి.సుబ్బరామి రెడ్డి తన ప్రయత్నాన్ని ఎట్టకేలకు విరమించుకోక తప్పలేదు. తెలుగు లలితకళాతోరణాన్ని యధాతధంగా ఉంచుతామని సుబ్బరామిరెడ్డి 30 నవంబరు 2010 వ తేదీ మధ్యాహ్నం టి.వి.9 చానెల్ ద్వారా ప్రకటించారు. తెలుగు జాతిలో వెల్లువెత్తిన ఆత్మాభిమానం తాకిడికి తట్టుకోలేకే ఈ దుష్ట యత్నాన్ని విరమించుకున్నారని భావించవచ్చు. " తెలుగు " అనే భావనే ఒక జాతినీ, భాషనూ సూచించే ఒక గొప్ప నామవాచకమైనప్పుడు తెలుగు కు ముందు మరొక పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జాతిజనుల ప్రశ్న! బడి పిల్లలు తెలుగులో మాట్లాడినందుకు "నేనెప్పుడూ తెలుగులో మాట్లాడను" అనే ఆంగ్లంలో రాసిన అట్ట బోర్డులను  పసిపిల్లల మెడల్లో వేలాడదీసి శిక్షించిన సంఘటన జరిగిన సందర్భంలో చేష్టలుడిగి  చూసిన ప్రభుత్వం తెలుగు లలిత కళాతోరణం విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన దుర్గతిని మాత్రం ప్రజలు గమనిస్తున్నారని విస్మరించకూడదు. సుబ్బరామిరెడ్డి వెనుకడుగు వేసిన తర్వాతనైనా ప్రభుత్వం తాను జారీ చేసిన ఉత్తర్వులను తక్షణం విరమించుకుంటే బాగుంటుంది.    తెలుగు లలితకళాతోరణాన్ని 33 ఏళ్ళ లీజుకు తీసుకుని వ్యాపారం చేసుకుందామని ప్రయత్నించి దానికి పబ్లిక్, ప్రయివేట్, పార్ట్ నర్ షిప్ (పిపిపి) అనే అందమైన పేరును తగిలించారు.. వాట్ యాన్ అయిడియా సర్జీ! ..జనం అంటున్నారు..మాట్లాడ్డానికే కాదు..జాతి స్ఫూర్తికీ  " తెలుగు " అవసరమని..!       

1 comment: