Saturday, December 19, 2009

పొట్టి శ్రీ రాములు గారి ఆమరణ దీక్ష -కొన్ని వాస్తవాలు !

మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందే 1946 లో ఎన్నికల సందర్భంగా కాంగ్రేస్ వెలువరించిన ప్రణాళిక తోనే ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరిక అప్పటి తెలుగు నేతల్లో మొలకెత్తింది. భాషా, సంస్కృతుల ఆధారంగా దేశంలోని రాష్ట్రాలన్నింటినీ పునర్వ్యవస్తీకరిచవలసి వుంటుందని కాంగ్రేస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించడమే ఇందుకు కారణం. దీనికి తోడు 1947 నవంబరు 27 న భాషా ప్రయుక్త రాష్ట్రాల సూత్రాన్ని తమ ప్రభుత్వం అంగీకరించిందని ప్రధాన మంత్రి నెహ్రూ ప్రకటించారు కూడా!
ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల అనంతరం 1952 అచ్టోబరు 19 న పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు చేపట్టిన ఉద్యమానికి, తెలుగు ప్రజల ఉనికి కోసం జరిగిన ఉద్యమంగానే పేరొచ్చిందిగానీ మరొకటి కాదు. 1952 డిసెంబరు 15 న ప్రాణాలను వదిలారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక చేసేది ఏమీ లేక నెహ్రూ 1952 డిసెంబరు 19 న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కొంత ప్రక్రియ తర్వాత 1953 అక్టోబరు 1 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణా , కోస్తా, రాయలసీమ మూడూ కలిస్తే విశాలాంధ్ర అవుతుంది. చరిత్ర అలాగే చెబుతొంది. విశాలాంధ్ర ఏర్పాటు కోసం కమ్యూనిస్టులు కృషి చేశారు. అయితే విశాలాంధ్ర కోరిక ఫలించలేదు. 1953 లో అంధ్ర రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. 1956 నవంబరు 1 న కోస్తా, రాయసీమ, తెలంగాణా (హైదరాబాదు రాష్ట్రం) ప్రాంతాలను కలుపుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దీంతో విశాలాంధ్ర కోరిక కొంతవరకు ఫలించింది.

4 comments:

  1. rightly said, but it is also important to say about telangana(1969) and jai andhra(1972) movements and how in 1984 telangana people have forgot about asking a seperate state when nt rama rao was cheif minister.

    because history is important and its link to the present must be elaborated.

    telangana region people can't say its struggle is for 50 or more years.
    thank you.

    ReplyDelete
  2. potti sriramulu is to be remembered by all telugu speaking people with reverence. Recently in the present agitation some people defaced the statues of potti sriramulu causing anguish to all telugu lovers.
    there is vast difference in deeksha or fast unto death undertaken by potti sriramulu and KCR. It is 'hasti masakaantharam'

    ReplyDelete
  3. ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చారు. www.24gantalu.co.cc చూడండి.. మీకు పూర్తి వాస్తవాలు తెలుస్తాయి.

    ReplyDelete