Monday, December 21, 2009

తెలుగు వారిపై తమిళ దురహంకారుల దాష్టీకం!

తెలుగు భాషను రెండవ అధికార భాష గా గుర్తించాలంటూ తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగు వారిపై సోమవారం (21 డిసెంబరు 2009) తమిళులు దాష్టీకం చెశారు. ఈ సంఘటన పోలీసుల లాఠీచార్జీ కి దారి తీసింది. వివరాలివి. తమిళనాడు లో తెలుగు మాతృభాష గా గల జనాభా 42 శాతం ఉన్నట్లు తెలుగు భాషోద్యమ సంఘాల అంచనా! తమిళనాడు లోని కృష్ణగిరి , ధర్మపురి జిల్లాలలో దాదాపు 60 శాతం మంది తెలుగు మాతృభాషగా గలవారు కావడం విశేషం! ఈనేపథ్యంలో తెలుగు భాషను అక్కడ రెండవ అధికార భాషగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనేది తెలుగు వారి డిమాండ్ . గతంలో కూడా తమ ఉనికి కోసం గళమెత్తిన తెలుగు వారిపై కొందరు ఛాందసులైన తమిళులు అకృత్యాలకు పాల్పడ్డారు కూడా! తాజాగా అక్కడి తెలుగు భాషోద్యమ కార్యకర్తలు సోమవారం కృష్ణగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలుగు వారిపై కొందరు తమిళులు దాడి చేశారు. ఐనప్పటికీ తెలుగు వారు శాంతియుతంగానే ధర్నా కొనసాగించడానికి పూనుకున్నారు. తెలుగు భాషను రెండవ అధికార భాషగా గుర్తించాలంటూ దశాబ్దాలపాటుగా తాము చేస్తున్న ఆందోళననను పరిష్కరించని పక్షంలో అధిక సంఖ్యలో తెలుగు వారున్న తమ కృష్ణగిరి జిల్లాను ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమలో కలపాలని వారు ఈ సందర్భంగా నినదించారు . ఈ నినాదాన్ని సహించలేని కొందరు తమిళ దురహంకారులు ఈ దాడికి పాల్పడ్డారు. తమిళులు సత్యాగ్రహ శిబిరం లో అల్లకల్లోలం సృష్టించడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా కొందరు గాయపడ్డారు. ఏ రాష్ట్రంలో నైనా అధిక సంఖ్యాకులు మాట్లాడే భాషను మొదటి అదికార భాషగా గుర్తిస్తారు. ఆ తర్వాత 12 నుంచి 15 శాతానికి మించి (ఆయా రాష్ట్ర విధానాలకు అనుగుణంగా )ఇతర భాషను మాట్లాడే వారు ఉంటే ఆ భాషను రెండవ అధికార భాషగా గుర్తిస్తారు! ఆంధ్ర ప్రదెశ్ లో ఉర్దూ భాషను 13 జిల్లాలలో రెండవ అధికార భాషగా గుర్తించడం జరిగింది. ఆయా జిల్లాలలోని మొత్తం జనాభాలో 12 శాతానికి పైగా ఉర్దూ భాషను మాట్లాడే వారు ఉండటమే ఇందుకు కారణం! తమిళనాడు తో పాటు ఇతర ప్రాంతాలలోని తెలుగు వారి హక్కులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
చిత్రం : తమిళనాడు రాష్ట్రం , ఎరుపు వర్ణంలో గుర్తించిన ప్రాంతమే కృష్ణగిరి జిల్లా .

2 comments:

  1. Along with Krishnagiri, dharmapuri in Tamilnadu, Kolar and Bellary in Karnataka should merged in Rayalaseema. Then only the greavances of Telugu peoplle comes to an end!

    ReplyDelete
  2. ఎక్కడన్నా! రాజగోపాలాచారి ఆంధ్ర వాళ్ళను కుక్కలు అన్నాడని మన తెలుగుజిన్నా ఆనందంగా ఎలుగెత్తి చాటుతుంటే సాటి తెలుగువారిని పరమకిరాతకంగా అవమానిస్తూ, దుషిస్తూ, ద్వేషిస్తూ ఉంటే ఇతర భాషలవాళ్ళు మనలను ఆదరిస్తారా?

    ReplyDelete