Tuesday, March 15, 2011

కువైట్‌లో తెలుగువైభవం వేడుకలు

కువైట్‌లో ఆంధ్రావైభవం వేడుకలను అత్యంత భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు కువైట్‌ రాక్‌డ్యాన్స్‌ అకాడమీ  వ్యవస్థాపకులు కె.ఈశ్వర్‌బాబు సోమవారం తెలిపారు. శ్రీకృష్ణచైతన్య సేవా సత్సంగ కమిటీ ప్రాంగణంలో శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్‌బాబు మాట్లాడుతూ మే 6వ తేది నుండి తెలుగు సంస్కృతి సాంప్రదాయలు ప్రతిబింబించేలా 100 మంది దంపతులతో శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వృతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే రాక్‌డ్యాన్స్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు విచిత్ర వేషదారణ, నృత్యాలు, పాటలు, ఆధ్యాత్మిక బోధన, ప్రతి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రధాన కార్యదర్శి దార్ల శ్రీనివాసాచారి మాట్లాడుతూ 2011 నూతన సంవత్సర వేడుకను కువైట్‌లో మొట్టమొదటి సారిగా తెలుగు డ్యాన్స్‌ కళాశాల రాక్‌డ్యాన్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, ఇదే స్పూర్పితో ఆంధ్రవైభవం వేడుకలను నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు 0096599692266 నెంబర్లో సంప్రదించాలన్నారు.

No comments:

Post a Comment