Friday, March 25, 2011

25 మందికి శ్రీకర నామ ఉగాది పురస్కారాలు!

పదమూడు రంగాల్లో విశిష్ఠ సేవలను అందిస్తున్న 25 మంది ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకర నామ ఉగాది పురస్కారాలను ప్రకటించింది. గురువారం కళాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ ఆర్వీ రమణమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెల 4న ఉదయం 9 గంటలకు రవీంద్రభారతిలో జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రిఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి పురస్కారాలను బహూకరిస్తారని తెలిపారు. 
 ఎంపికైన వారి వివరాలు..
సాహిత్యం: డా.ముదిగొండ శివప్రసాద్‌, డా.తిరుమల శ్రీనివాసాచార్య  
సంగీతం: జి.వి.రామకుమారి (విజయవాడ), అయ్యగారి శ్యామసుందరం  
శిల్పం: వై.శివరామాచారి, రోహిణి రెడ్డి  
చిత్రలేఖనం: కె.శేషగిరిరావు  
పాత్రికేయం: ఎస్‌.జనార్థన్‌, వల్లీశ్వర్‌(ఆంధ్రప్రదేశ్‌ పత్రిక), స్వాతిసంపాదకుడు వేమూరి బలరాం
నాట్యం: వి.రంగమణి (కూచిపూడి), అంజిబాబు (కథక్‌)  
నాటకం: ఎస్‌.ఎన్‌.చారి (హనుమకొండ), జి.ఎస్‌.ఎన్‌.శాస్త్రి
ఇంద్రజాలం: కె.కళాధర్‌ (మైమ్‌), ఎస్‌.మనోహర్‌రావు (రాజమండ్రి)  
బుర్రకథ: బాబ్జీ (రామచంద్రపురం), ప్రేమానందం (మందపల్లి)  
హరికథ: బి.రంగారావు భాగవతార్‌ (శ్రీకాకుళం), బి.యతిరాజు భాగవతార్‌ (కుసుంపురం)
వైద్యం: డా.జి.ప్రసాదరావు (ఆశా హాస్పిటల్‌)  
జానపదం: డా.ఎస్‌.మురళి బాబు (విశాఖ), పి.ప్రకాశ్‌ (మెదక్‌జిల్లా)
ప్రవాసాంధ్రులు: సి.ధర్మకర్త (రసమయి-దుబాయి), కోమటిజయరామ్‌ (తానా-అమెరికా)

1 comment:

  1. అది శ్రీ"ఖర" నామ సంవత్సరమండీ... శ్రీకర కాదు.

    ReplyDelete