Monday, March 26, 2012

సామాజిక రుగ్మతల నిర్మూలను కలాలే అస్త్రాలు-తెలుగు భాషోద్యమ సమాఖ్య

మైదుకూరు : సమాజంలో చోటు చేసుకుంటున్న సాంస్కృతిక విధ్వంసాలు, సామాజిక రుగ్మతలపై కలాలను అస్త్రాలుగా ప్రయోగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కవులు, కవయిత్రులు, రచయితలు పేర్కొన్నారు. ఉగాది సంద ర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వ హించిన రచనల పోటీల్లో విజేతలకు ఆదివారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో బహుమతులు ప్రదా నం చేశారు. కథా రచయిత తవ్వాఓబుల్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అందులో కవి లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతీయ భాషా సంస్కృతులు విచ్ఛినమవుతున్న తరుణంలో ప్రజల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పై ఆలోచన పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
తెలుగు భాషోధ్యమ సమాఖ్య తెలుగునాట భాషా సంస్కృతి వికాసానికి చేస్తున్న కృషిని కొనియాడారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన కవితలు, కథలు, వ్యాసరచన పోటీల్లో ఎంపికైన రచనల్లో రచయితలు సామాజిక స్పృహను బాధ్యతతో జోడించారని, కథల్లో కవితల్లో నేటి సమాజంలోని లింగవివక్ష, గ్రామీణ రాజకీయాలు, బాల్యం, భాష, సంస్కృతుల విధ్వంసం తదితర అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు. కథా రచయిత తవ్వా ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ సాహిత్య వారసత్వాన్ని, సంస్కృతిని ముందు తరాలకు అప్పగించాల్సిన బాధ్యత రచయితలపై ఉందన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ సామల రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగు భాషొద్యమం జరుగుతున్న తీరును ,చేపడుతున్నా కార్యక్రమాలను ఆయన వివరించారు. బీజేపీ నాయకులు బీపీవీ ప్రతాప్‌రెడ్డి, అందె సుబ్బన్న, జీవిత భీమా సంస్థ (ఎల్.ఐ.సి. ) అభివృద్ధి అధికారి ఎస్.సాదక్, రాటా అధ్యక్షుడు కొండపల్లి శేషగిరి, రైతు సేవా సంఘం అధ్యక్షుడు డీఎన్ నారాయణ, రైతు నాయకుడు పోలు కొండారెడ్డి, మైదుకూరు శాఖ అధ్యక్షుడు వీరస్వామి, సీపీఐ నాయకులు ఏవీ రమణ, రచయితలు, కవులు తదితరులు తమ రచనలు చదివి వినిపించారు.
బహుమతుల ప్రదానం
కథల పోటీలో మొదటి బహుమతి పొందిన శాంతి
ఉగాది సందర్భంగా తెలుగుభాషోద్యమ సమాఖ్య నిర్వహించిన కవితల పోటీలో పి. నీలవేణి (రామాపురం), లెక్కల వెంకట్రామిరెడ్డి(లెక్కలవారిపల్లె), ఎస్‌ఆర్ ప్రతాప్‌రెడ్డి(చల్లబసాయపల్లె) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మాబుజాన్, డీబీ దేవి, బేబీ సునీత, ఎస్.ఆలియా, కె.శ్రీనివాసులు, ఓ.సుధాకర్ విశేష బహుమతులు పొందారు. కథల పోటీల్లో ఎన్.శాంతి(కడప), కె. రామమోహన్(కామనూరు), ఎల్ కళారెడ్డి(సంబేపల్లి) మొదటి మూడు బహుమతులు సాధించగా, సయ్యద్ సంధాన్‌బాషా, కె.నాగమ్మ, పెరుగు సాయికృష్ణ, వై.రాజశేఖర్, వై.రాజేష్‌కుమార్ విశేష బహుమతులు పొందారు. వ్యాసరచన పోటీల్లో సగిలి విజయరామారావు(మార్కాపురం), గంగనపల్లి వెంకటరమణ(ఆకేపాడు), లక్ష్మినారాయణ(వనిపెంట) మొదటి మూడు బహుమతులు గెలుచుకోగా, ఎన్.శాంతి, పి.మురళి, ఈరి మాధురి, బీవీ నరసింహులు విశేష బహుమతులు పొందారు.

No comments:

Post a Comment