Sunday, February 21, 2021

మైదుకూరులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

 తెలుగుసమాజం, తెలుగు భాషోద్యమ సమాఖ్యల ఆధ్వర్యంలో ఆదివారం కడప జిల్లా




మైదుకూరులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈకార్యక్రమం జరిగింది. తెలుగు సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు ,రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ధర్మిశెట్టిరమణ, తబ్బిబ్బు మహానందప్ప, ఉపాధ్యాయులు ఎ .బాలగంగాధర రావు , ఎల్. సూర్యనారాయణ రెడ్డి , విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుతల్లి చిత్రపటాన్ని మల్లెపూదండ తో అలంకరించారు. ఈ సందర్భంగా మాతృభాష విశిష్టతను వక్తలు వివరించారు. విద్యార్థులకు పొడుపుకథలు , సామెతలు, తెలుగు పౌరుషం పుస్తకాలను బహుమతులుగా పంపిణీ చేసారు.