Tuesday, January 12, 2010

ముత్తులూరుపాడులో బుక్కరాయల కాలం నాటి శాసనం లభ్యం!

కడప జిల్లా ఖాజీపేట మండలం ముత్తులూరుపాడులో తెలుగు సామాజిక సాంస్కృతిక సాహిత్యాభివృద్ధి సంస్థ విజయనగర ప్రభువైన బుక్కరాయల కాలం నాటి అరుదైన శాసనాన్ని కనుగొంది. గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న ఈ శాసనాన్ని తెలుగు సంస్థ గౌరవాధ్యక్షుడు,తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంతీయ కార్యదర్శి తవ్వా ఓబుల్ రెడ్డి, ఆ సంస్థ ఉపాధ్యక్షుడు ఏ.వీరాస్వామి, కార్యదర్షి ముండ్లపాటి వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి ధర్మిసెట్టి వెంకట రమణయ్య నెల రోజుల కిందట గుర్తించారు. ఈ శాసనం చాయా చిత్రాన్ని తీసుకుని కడప లోని బ్రౌన్ తెలుగు పరిశోధనా కేంద్రం పరిశోధకులు కట్టా నరశిం హులు దృష్టికి తీసుకెళ్ళడం తో మైసూరు, చెన్నై లకు చెందిన భారత పురావస్తు శాఖ శాసనాల విభాగపు అధికారులు 2010 జనవరి 11 వ తేదీన ముత్తులూరు పాడు కు వచ్చి శాసనాన్ని పరిశీలించారు. శక సంవత్సరం 1287 ( క్రీ. శ. 1365) కాలం నాటి శాసనంగా వారు ఈ శాసనాన్ని గుర్తించారు. భారత పురావస్తు శాఖ వార్షిక ప్రచురణలో ఈ శాసనం వివరాలను ప్రచురిస్తామని వారు తెలిపారు. గ్రామానికి చెందిన వారు అప్పట్లో మల్లికార్జున, భోగనాధ దేవరలకు భూమిని దానం గా ఇచ్చినట్లుగా ఈ శాసనంలో లిఖించారు.
పై చిత్రం: ఈనాడు దిన పత్రిక వార్తాంశం. 12 జనవరి 2010.

No comments:

Post a Comment