Sunday, August 28, 2011

మాతృభాషను మరవొద్దు - మంత్రి గల్లా అరుణకుమారి


కోయంబత్తూరు: ఇతరుల భాషలను గౌరవించి వారితో వారిభాషలోనే మాట్లాడే గొప్ప సంప్రదాయం తెలుగువారిది. దీని కోసం పరభాషలను నేర్చుకుంటున్నారు. వారి భాషను నేర్చుకుని వారి సంస్కృతిలో భాగమవుతున్నారు. కానీ ఈ తరుణంలో మాతృభాషను మరుస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి గల్లా అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇతర భాషల్లోనూ ప్రావీణ్యం సాధించడం తప్పనిసరి. దీనిని నేను వ్యతిరేకించను. కాని మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ మరువరాదని ఆమె తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు సమాఖ్య(డబ్ల్యుటీఎఫ్‌) ప్రాంతీయ సమావేశం శనివారం కోయంబత్తూరులోని రామక్రిష్ణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరుణ కుమారి మాట్లాడుతూ.. ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు తెలుగు రాష్ట్రాన్ని మరువద్దని, ముఖ్యంగా వారి సొంత గ్రామాలకు సేవా కార్యక్రమాలను అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. గత 20 రోజుల నుంచి దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తనకు భయమేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ న్యాయమూర్తి జస్టీస్‌ జి.రఘురాం తీవ్ర అసంతృప్తితో పేర్కొన్నారు. యార్లగడ్డ ప్రభావతి స్మారక పురస్కారాన్ని ప్రముఖ బుల్లితెర, వెండితెర దర్శకురాలు మంజులా నాయుడు అందుకున్నారు

1 comment: